
దూరం తగ్గింది!
జిమ్కార్బెట్ నేషనల్ పార్క్... ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎంతో పేరున్న పర్యాటక ప్రదేశం. టైగర్ రిజర్వ్గా ఎంతో ప్రసిద్ధి. స్థానికులకు ఓ ఆటవిడుపు. చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఎంతో మంది వీకెండ్స్లో ఈ ట్రిప్లకు వెళ్లడం పరిపాటి. అంతేకాదు ఈ జాతీయ పార్క్ చుట్టూ వెలసిన...
read moreక్రూయిజ్లో ఖుషీగా…
పర్యాటకులకోసం విమానాల్లో, రైలు, రోడ్డు మార్గాల్లో దేశ, విదేశాల్లోని చార్రితక, దర్శనీయ స్థలాలకు ప్యాకేజీలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) అందిస్తోంది. ఇప్పుడు తొలిసారిగా క్రూయిజ్ (నౌక) యాత్ర లకు శ్రీకారం చుట్టింది. విలాసవంతమైన...
read more
ఎన్ని విశేషాలో.. ఈ వంతెనలో.. !
ఈ వంతెన పేరు యావుజ్ సుల్తాన్ సెలిం బ్రిడ్జ్. ఒట్టోమాన్ను పాలించిన రాజు యావుజ్ సుల్తాన్ సెలిం జ్ఞాపకార్థం ఆయన పేరు ఈ వంతెనకు పెట్టారు. ఈ వంతెన నిర్మాణం వల్ల ఇస్తాంబుల్లో ట్రాఫిక్ కష్టాలు చాలా తగ్గాయి. యూరప్, ఆసియాలను కలుపుతున్న వంతెన ఇది. బాస్పోరస్ అనే...
read more
నాడు దెయ్యాల కొంప.. మరి నేడు..?
ఒకప్పుడు అక్కడ ప్రజలు అడుగు పెట్టాలంటే వణుకు. అక్కడ దెయ్యాలు ఉండేవని స్థానికులు భ్రమపడేవారు. కానీ వందేళ్ల తర్వాత అక్కడ పరిస్థితి మారిపోయింది. దానికి కారణం అక్కడి వాతావరణాన్ని పూర్తిగా ఫేమస్ టూరిస్ట్ స్పాట్గా మార్చేయడమే. ఈ బిజీ బిజీ లైఫ్లో ఉన్న ఒత్తిడిని...
read more
చరిత్రకు సాక్ష్యం సిప్రస్ !
పర్యాటకానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే మిడిల్ ఈస్ట్ దేశాల్లో సిప్రస్ ఒకటి. టర్కీకి దక్షిణ దిక్కులో, చుట్టూ మధ్యధరా సముద్రాన్ని చుట్టుకొని ఉన్న ఈ దేశం పర్యాటకం మీద ఆధారపడింది. ఇక ఈ దేశాన్ని చూడాలంటే వేసవి సెలవులే ఉత్తమం! ముఖ్యంగా అక్కడి అందమైన సాగరతీరాలే పర్యాటకులను...
read more
భగభగలాడే చల్లని దీవి!
అడవుల్లేని దేశం అది. ఏడాదంతా మంచు పరుచుకొని ఉంటుంది. వందలకు పైగా అగ్నిపర్వతాలను తనలో దాచుకొన్న విశిష్టత దీని సొంతం. అందుకే ప్రపంచంలోని అనేకమంది సందర్శకులు చూడటానికి పోటీపడతారు. ఈ దేశం పేరు ఐస్ల్యాండ్. ఇదొక దీవి. దీన్ని ల్యాండ్ ఆఫ్ ఫైర్, ఐస్గా అభివర్ణిస్తారు....
read more
ఈ సారి అటెళ్దాం
టర్కీ పేరు విన్నగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఆ దేశ రాజధాని ఇస్తాంబుల్. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అనేక సినిమాల్లో ఈ నగర అందాలు కనువిందు చేశాయి. అంతెందుకు రెండేళ్ల క్రితం వచ్చిన బాండ్ చిత్రం ‘స్కైఫాల్’ ఓపెనింగ్ సన్నివేశంలోనూ కనిపిస్తుందీ నగరం. ముఖ్యంగా...
read more
హనీమూన్ కు సరసమైన ప్రదేశం-ప్రకృతి సౌందర్యానికి సొంతం కేరళ
కేరళ పేరు వినగాని పర్యాటకానికి మారు పేరు అని గుర్తు వస్తుంది. పచ్చటి ప్రక్రుతి కొబ్బరి తోటలు, తాటి చెట్లతో నిండుగా కనిపించే బీచ్ లు, ఆహ్లాదకర బ్యాక్ వాటర్స్ లో బోటు ప్రయాణాలు, అనేక దేవాలయాలు, ఆయుర్వేద వైద్య సుగంధాలు, మంచి నీటి సరస్సులు, నదులు, కాలవలు మొదలగు ఆకర్షణల...
read more
రామాయణానికి కేరాఫ్ అడ్రస్.. గ్రేప్ సిటీగా ప్రకృతి సంపదకు లోటులేదు..
సంవత్సరంలో ఒక్కసారైనా షిరిడీ దర్శించాలని కోరుకునే పర్యాటకులెందరో. ఎందుకంటే సాయినాధునిపై ఉండే భక్తిభావం, శిరిడి ప్రకృతి అందాలు మనస్సును కట్టిపడేస్తాయి. షిరిడీ దర్శించే వారు మార్గంలో నాసిక్ మరో మజిలీ. గ్రేప్ సిటిగా ప్రసిద్ది చెందిన నాసిక్ లో ఒక వైపు గోదావరి నదీ జలాల...
read more
నందప్రయాగ్, ఔలి
నందప్రయాగ్ ఉత్తరాఖండ్ చమోలి జిల్లా లో ఉంది. ఇది అలకానంద మరియు నందాకిని నదుల సంగమం వద్ద ఉంది. భక్తులు తమ పాపాలను పోగొట్టుకోవటానికి ఈ సంగమం వద్ద స్నానం చేస్తారు. పురాణాల ప్రకారం, నందప్రయాగ్ యదు వంశంనకు రాజధానిగా ఉండేది. ఇది బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ ప్రముఖ పర్యాటక...
read moreదీర్ఘజీవనానికి అధ్యాత్మ నీతి
సమస్త జీవరాశుల్లో పశుపక్ష్యాదులు శ్రేష్ఠమైనవి. వాటి లో బుద్ధిజీవులు గొప్పవి. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠమైనవారు అని శాస్త్రం చెబుతున్నది. అందుకనే ‘వాగ్భటం’లో
ఉత్కృష్టః చతురశీతి లక్ష యోనిషు మానుషః
దేహః సర్వార్థకృత్ తస్మాత్ రక్షణీయో విచక్షణైః
అని చెప్పారు. అంటే ‘‘84లక్షల జీవరాశుల్లో మానవుడు చాలా గొప్పవాడు. ఈ మానవ దేహం అన్ని విధాలైన ప్రయోజనాలనూ సాధించగలిగినది. ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి’’ అని అర్థం. ఇలా ఆరోగ్యవంతంగా ఉండటానికి మితాహారం, తగినంత నిద్ర, ఇంద్రియ నిగ్రహం అవసరం అని వాగ్భటంలోనే చెప్పారు. వాటితోపాటు కొన్ని గుణాలు అలవడకుండా చూసుకోవాలి అని కూడా ధర్మశాస్త్రం, ఆయుర్వేదం చెబుతున్నాయి. అవేంటంటే.. క్రోధం, రోషం, ఇతరుల వస్తువుల కోసం ఆశపడటం, మోహాన్ని పెంచుకోవడం, అతిశయోక్తులు చెప్పుకోవడం, ఇతరులకు ద్రోహం చెయ్యడం, ఉపయోగం లేని పనులు చెయ్యడం, అత్యాశ, ఇతరుల గురించి అపవాదులు పలకడం, ఇతరులపట్ల అసూయ, కామదృష్టి, అకారణ కోపం. ఇవన్నీ ఆయుర్దాయాన్ని తగ్గించే గుణాలని, వీటిని విడిచిపెట్టాలని పెద్దలు చెప్పారు. అందుకే.. వైద్యులు శరీరానికి చికిత్స చేయటానికి ముందు రోగికి పై గుణాలేవైనా ఉంటే వాటిని నివారించే ఉపాయాలు చూడాలట.
తేషాం యోగమూలో నిర్ఘాతః
..అని శాస్త్రం చెబుతోంది. అంటే యోగాభ్యాసం ద్వారా ఈ అవలక్షణాలను తగ్గించవచ్చునట. ప్రతివైద్యుడూ పరిశీలించాల్సిన విషయాలివి అని ఆపస్తంబ ధర్మశాస్త్ర వచనం. వీటితోపాటు త్యాగబుద్ధి, ఋజుమార్గంలో నడవటం, మృదుస్వభావం కలిగి ఉండటం, మనో నిగ్రహం, సమస్త జీవుల పట్ల ప్రేమ, యోగజీవనం, ఉన్నదానితో సంతృప్తి చెందటం అనే గుణాలు అవసరమట. అలాగే మరి ఎనిమిది ప్రధాన గుణాలు కూడా కావాలి. అన్ని జీవులపట్లా దయ కలిగి ఉండటం, ఎవరు ఎంత బాధించినా, హింసించినా బాధను వ్యక్తంచేయకుండా ఓర్చుకోవడం, పక్కవారి ధార్మిక బుద్ధిని, అర్థవృద్ధిని చూసి అసూయ చెందక పోవడం, అక్రమంగా సంపాదించక పోవడం, మనస్సులో కల్మషం లేకుండా ఉండటం, వాక్కులో మంచి, భౌతికంగా శరీరంతో ఏ తప్పూ జరగకుండా చూడటం, తన శరీరానికి బాధను కలిగించే ధర్మాన్ని ఆచరించకపోవడం, అందరికీ హితవు కలిగే పనులు చేయడం, బాధించే పనులు చేయకుండటం. ఇవన్నీ మనిషిగా బతకటానికి అవసరమైనవే. ఈ గుణాలకు అధ్యాత్మనీతి అని పేరు. వీటిని కలిగి ఉండి అహంకారం, లోలత్వం, దర్పం లేకుండా, ఇతరుల మెప్పును ఆశించకుండా ఎవరు జీవిస్తారో వారు శిష్టులని బోధాయన ధర్మశాస్త్రం బోధిస్తోంది. ఇదీ మనిషిగా జీవించటం అంటే. ఇవీ మానవుల గుణాలు.
ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే…..
వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వారు సూత్రాలను అవలంబిస్తారు. వారు పాటించని వారి కంటే ముందంజలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆందోళనలు కలుగుతాయి.
కొందరి జాతకంలో ఎలాంటి లోపాలు లేకున్నా ఇంటి వాస్తు బాగా లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక రుగ్మత, ఒత్తిడి, కుటుంబంలో కలహాలు వంటివి ఇంటికి వాస్తులేదని సూచిస్తాయి.
వాస్తు దోషం కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనుగోలు చేసే ముందు అన్నీ చూయించుకోవాలి. నేల అడుగున గుళ్లు. శ్మశానాలు ఉండే ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారాన్ని యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టీ, ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అయితే ఒక్కోసారి ఇళ్లంతా వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతుంటాయి.
అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్క.
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు… శ్లోకం అర్థమేంటి?
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః
మనమందరం కూడా నిత్యమూ ఏదో ఒక సందర్బంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాము. కానీ దాని అర్థం మనం తెలుసుకోకుండానే వల్లిస్తుంటాము. మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారంగా భావించాలి. అందుకే ఈ మంత్రాన్ని ఎన్నో సంస్థలు ప్రత్యేకించి విధి నిర్వహణలో పఠించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ శాంతి మంత్రాన్ని అంతటా అమలుపరచినట్లయితే సర్వత్రా శాంతిసౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని పై శ్లోకం తెలియచేస్తుంది. ఈ శ్లోకం అర్థమేమనగా..
సహనావవతు….
మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం. పరస్పరం కలసిమెలసి రక్షించుకుందాం. మన రాష్ట్రాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకుందాం. ముఖ్యంగా ఇది ఐక్యతా సూత్రం వంటిది.
సహనౌభువన్తు….
ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలసి అనుభవిద్దాం. అలాంటి ధన సంపాదనకుగాను దోహదం చేసే శక్తి గల విద్యనే మనం సంపాదించుకుందాం. విలువలు లేని విద్యలు మనకొద్దు. అలాంటి వాటిని తక్షణమే వదిలేద్దాం.
సహవీర్యం కరవావహై…
మనం కలసిమెలసి పరాక్రమిద్దాం. మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలను చేయగలిగే చైతన్యాన్ని కలిగించే ప్రభోదించే విద్యను మనం సాదిద్దాం.
తేజస్వినావధీతమస్తు…
మనల్ని తేజోవంతులుగా, వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని, విద్యను పొందుదాం. మనలో ఆత్మాభిమానం, స్వజాతి అభిమానం కల్గి ఉండేలా నడుచుకుందాం. అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా కార్య తేజస్సుతో కొత్తకొత్త పరిశోధనలు గావిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం.
మావిద్విషావహై…..
మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం. అహింసా పరమోధర్మః అనే సూక్తిని పాటిద్దాం. ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతిపధం వైపు పయనిస్తూ పురోభివృద్దిని సాధిద్దాం.
కాబట్టి పైన తెల్పిన విధంగా నమమందరం కూడా శాంతిమమంత్రాన్నని తప్పక పఠిస్తూ ఆచరణలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఉండేందుకు ప్రయత్నిద్దాం. ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుందాం.