పర్యాటకులకోసం విమానాల్లో, రైలు, రోడ్డు మార్గాల్లో దేశ, విదేశాల్లోని చార్రితక, దర్శనీయ స్థలాలకు ప్యాకేజీలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) అందిస్తోంది. ఇప్పుడు తొలిసారిగా క్రూయిజ్ (నౌక) యాత్ర లకు శ్రీకారం చుట్టింది. విలాసవంతమైన నౌకలో, ఆహ్లాదకర వాతావరణంలో
పర్యటనలకు ఏర్పాట్లు చేస్తోంది. వివరాలు ఇవిగో…
ఎప్పుడు?: ఈ ఏడాది జూన్ 24 నుంచి జులై 7 వరకూ
యాత్ర వివరాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన పర్యాటకులు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలి. తర్వాత టూర్ షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. జూన్ 24న ఢిల్లీ నుంచి దుబాయ్కీ, అక్కడి నుంచి కోపెన్హెగెన్కు విమానంలో ప్రయాణం… 25వ తేదీ ఉదయం కోపెన్హెగెన్ పోర్టు నుంచి క్రూయిజ్ యాత్ర మొదలవుతుంది. జర్మనీ, పోలండ్, ఫిన్లాండ్, రష్యా, స్పెయిన్, స్వీడన్ దేశాల మీదుగా సాగుతుంది. ఆ దేశాల్లోని వివిధ నగరాలలో సైట్ సీయింగ్ ఉంటుంది. జూలై 4న తిరిగి కోపెన్హెగెన్లో క్రూయిజ్ ప్రయాణం ముగుస్తుంది. అక్కడినుంచి దుబాయ్, ఢిల్లీ మీదుగా హైదరాబాద్ రావడంతో టూర్ పూర్తవుతుంది.
ఇవీ సౌకర్యాలు: ఈ పర్యటన నార్వేజియన్ గేట్వే అనే నౌకలో సాగుతుంది.
దానిలో మొత్తం 30 బాల ్కనీలు ఉంటాయి. వాటిలోంచీ సముద్రాన్ని వీక్షిస్తూ ప్రయాణం చేయవచ్చు. నౌకలో రెండు ప్రధాన డైనింగ్ హాళ్లు, స్విమ్మింగ్ పూల్, బార్ అండ్ రెస్టారెంట్, కాఫీ బార్, ఫిట్నెస్ సెంటర్, ఇంటర్నెట్, వైఫై, స్పా, సెలూన్ సర్వీసులు, డైనింగ్ ఎంటర్టైన్మెంట్ సదుపాయాలు ఉంటాయి. పర్యాటకులు తమకు నచ్చిన సినిమాలను చూడొచ్చు. కోపెన్హెగెన్లో త్రీస్టార్ హోటల్లో, ఢిల్లీలో వసతి కల్పిస్తారు.
టికెట్ ధరలు..
ఫిబ్రవరి 28 లోగా బుకింగ్ చేసుకుంటే…
ఒక్కొక్కరికి: రూ.4,83,630 ఫ ఇద్దరు కలిపి బుక్ చేసుకుంటే (ఒక్కొక్కరికి): రూ. 2,95,817 ముగ్గురు కలిసి బుక్ చేసుకుంటే (ఒక్కొక్కరికి) రూ. 2,63,634
పిల్లలకు (బెడ్తో- ఒక్కరికి): రూ.2,43,516 – (బెడ్ లేకుండా- ఒక్కరికి): రూ.1,87,719 0-2 మధ్య వయసు పిల్లలకు (ఒక్కరికి): రూ.27,258 మార్చి 1 నుంచి 22 వరకు బుకింగ్ చేసుకుంటే…
ఒక్కరికి: రూ.5,80,356 ఫ ఇందులో ఇద్దరు కలిసి బుక్ చేసుకుంటే (ఒక్కొక్కరికి): రూ.3,54,974 ఫ ముగ్గురు కలిసి బుక్ చేసుకుంటే (ఒక్కొక్కరికి): రూ.3,16,365 పిల్లలకు (బెడ్తో- ఒక్కరికి): రూ.2,92,215- (బెడ్ లేకుండా- ఒక్కరికి): రూ.2,25,267 0-2 మధ్య వయసు పిల్లలకు (ఒక్కరికి): రూ.32,708